ePaper
Friday, May 15, 2026

ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ కీలక సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన చర్చలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.

టి. హరీశ్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్. మధుసూదనాచారి, ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌చార్జీల నియామకం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!