సంగారెడ్డి | స్థానిక వార్తలు:
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముదిమాణిక్ గ్రామంలో కర్పూర ఠాకూర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు హరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి రాజారాం నాయి హాజరయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు హరీష్ కుమార్తో పాటు మండల కోశాధికారి రాజు, మండల ముఖ్య సలహాదారులు రాదయ, మండల సలహాదారులు విష్ణు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వక్తలు కర్పూర ఠాకూర్ జీవితం, ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments