ePaper
Friday, September 4, 2026

లయన్స్ జిల్లా గవర్నర్ దంపతులకు నల్లగొండలో ఘన స్వాగతం

చీకటి వెలుగు నల్లగొండ.

సేవా కార్యక్రమాల్లో జిల్లా–320ఈను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి: కేవీ ప్రసాద్

లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా–320ఈ నూతన జిల్లా గవర్నర్‌గా హాంకాంగ్‌లో జరిగిన 108వ అంతర్జాతీయ మహాసభలో బాధ్యతలు స్వీకరించి స్వదేశానికి చేరుకున్న పీఎంజేఎఫ్ లయన్ కేవీ ప్రసాద్, ఎంజేఎఫ్ లయన్ గీతావాణి కక్కిరేని దంపతులకు నల్లగొండలో ఘన స్వాగతం లభించింది. చర్లపల్లి బైపాస్ వద్ద లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు వారిని ఆహ్వానించగా, అక్కడి నుంచి భారీ ర్యాలీగా లయన్స్ భవన్‌కు తీసుకువెళ్లారు.
లయన్స్ భవన్‌లో నిర్వహించిన సన్మాన సభలో జిల్లా గవర్నర్ కేవీ ప్రసాద్ మాట్లాడుతూ, సభ్యులు అందించిన అపూర్వ స్వాగతం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా నిలిచిందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని ప్రతి సభ్యుడు సహకారం అందిస్తే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, జిల్లా–320ఈను సేవా రంగంలో అగ్రస్థానంలో నిలపడమే కాకుండా బహుళ జిల్లాల పరిధిలో ప్రథమ స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం వివిధ లయన్స్ క్లబ్‌ల ప్రతినిధులు గవర్నర్ దంపతులను శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తొలి ఉప జిల్లా గవర్నర్ సతీష్ కుమార్ కోడె, ద్వితీయ ఉప జిల్లా గవర్నర్ గుడిపూరి వెంకటేశ్వర్ రావు, తక్షణ మాజీ జిల్లా గవర్నర్ మదన్ మోహన్ రేపాల, మాజీ జిల్లా గవర్నర్లు తీగల మోహన్ రావు, జగినీ భీమయ్య, నేతి రఘుపతి, యానాల మోహన్ రెడ్డి, జిల్లా మంత్రివర్గ కార్యదర్శి నిమ్మల పిచ్చయ్య, జిల్లా మంత్రివర్గ ఖజాంచీ యర్రమాద శ్రీనివాస్, జిల్లా వస్తు–సేవల పన్ను సమన్వయకర్త బాచుపల్లి రవీందర్ రావు, మాజీ జిల్లా మంత్రివర్గ ఖజాంచీ గట్టుపల్లి అశోక్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు, ప్రాంతీయ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ క్లబ్‌ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు, సీనియర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!