ePaper
Friday, September 4, 2026

రీ-నీట్ పరీక్షకు 15 నిమిషాల అదనపు సమయం.. NTA కీలక నిర్ణయం

జూన్ 21న నిర్వహించనున్న రీ-నీట్ యూజీ-2026 పరీక్షకు జాతీయ పరీక్షల సంస్థ (NTA) 15 నిమిషాల అదనపు సమయాన్ని ప్రకటించింది.

ఇప్పటివరకు 180 నిమిషాలుగా ఉన్న పరీక్ష వ్యవధిని 195 నిమిషాలకు పెంచారు. దీంతో పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగనుంది.

హాజరు పత్రాలపై సంతకాలు, పర్యవేక్షణకు సంబంధించిన ఇతర తప్పనిసరి ప్రక్రియల కోసం ఈ అదనపు సమయాన్ని కేటాయించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

విద్యార్థుల నుంచి గత కొన్నేళ్లుగా వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా ఈ మార్పులు చేసినట్లు తెలిపింది.

రీ-నీట్ పరీక్షను నిష్పక్షపాతంగా, భద్రంగా, అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!