నల్గొండ శివారులో అద్దంకి–నార్కట్పల్లి రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంగసాని సాయిసందీప్ తన కారులో హైదరాబాద్కు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగింది.
ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో పానగల్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జైంది.
ఈ ప్రమాదంలో సాయిసందీప్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments