చీకటి వెలుగు నల్లగొండ.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్తో పాటు హెల్త్ కార్డులు!
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, నెలవారీ పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు హెల్త్కార్డులు, ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వెల్లడించింది. నిన్న శనివారం ఈ కమిటీ సభ్యులు సీఎంను కలిసి, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల నివేదికను అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల రుణం తీర్చుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments