41వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం: కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి

నల్గొండ: పేదల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని 41వ డివిజన్ కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. 41వ డివిజన్కు చెందిన భోగ లక్ష్మమ్మ డబుల్ బెడ్రూమ్ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండలో పేదల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని పేర్కొన్నారు. 41వ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీరెల్లి రామచంద్రయ్య, కొత్తపల్లి రామచంద్రయ్య, కట్ట మాణిక్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments