ఇజ్రాయిల్ మరియు లెబనాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించేందుకు అంగీకరించాయి.
అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగిన కీలక చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు.
ఏప్రిల్ 16 నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరింత కాలం కొనసాగిస్తూ శాంతి చర్చల్లో పురోగతి సాధించేందుకు ఈ పొడిగింపు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అమెరికా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి శాంతి స్థాపన దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments