ePaper
Tuesday, March 17, 2026

వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎన్నిక

ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం, రాష్ట్ర అధ్యక్షుడు కార్ల జంగయ్య పాల్గొన్నారు. సమావేశంలో కొమ్ము హరికుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా గడ్డం కాసిం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. బడ్జెట్‌లో వికలాంగుల పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేసి వికలాంగుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేయాలని సూచించారు.

త్వరలో గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి, వచ్చే నెలలో జిల్లా మహాసభ నిర్వహించాలని నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

జిల్లా నూతన కమిటీ ఇలా ఉంది:

జిల్లా అధ్యక్షుడు: కొమ్ము హరికుమార్ ఉపాధ్యక్షులు: మున్య నాయక్, చిర్రబోయిన యాదయ్య ప్రధాన కార్యదర్శి: జిల్లా భాస్కర్ ఇతర నాయకులు: మేదరి రాములు మహిళా అధ్యక్షురాలు: జి. యాదమ్మ అధికార ప్రతినిధి: పాల్వాయి సుధాకర్ సహాయ కార్యదర్శి: సహదేవుడు

ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా సీనియర్ నాయకులు తిరుమల జలంధర్, లింగయ్య, మచ్చగిరి, బుర్ర నాగయ్య, బషీర్, పిల్లి బాలకృష్ణ, కనకమ్మ, లలిత, అశోక్, అంజయ్య, వెంకటేష్, యాచారం శంకర్, సురేందర్ రెడ్డి, రమేష్, ఏ. శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!