
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన స్థానిక SBR గార్డెన్స్ లో వివేకానందుని 163వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి నల్లగొండ శివరామిరెడ్డి గారు మాట్లాడుతూ యువత చైతన్యవంతులై డ్రగ్స్ కు దూరంగా ఉంటూ దేశ అభివృద్ధికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.ప్రధానవక్తగా విచ్చేసిన అన్నదాన సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచం మొత్తం విరాజిల్లేలా వివేకానందుని బోధనలు అవసరపడ్డాయని,ఆయన స్ఫూర్తితో దేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా యువతకు ఆట,పాటలు మరియు వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ గార్లపాటి వెంకటయ్య గారు,జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్ గారు,పర్యావరణ్ ప్రముఖ్ నన్నూరి రాంరెడ్డి గారు,పిల్లి రామరాజు గారు, గూడూరు శ్రీనివాస్ గారు,అంజిరెడ్డి గారు,మాజీ రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు అలుగుపల్లి పాపిరెడ్డి గారు,మాజీ జిల్లా అధ్యక్షులు,ఇరుగు శ్రీరాములు గారు,నంద్యాల నర్సిరెడ్డి గారు,విజయ్ కుమార్ గారు,లతకుమారి గారు,గోపాల్ రెడ్డి గారు,గౌతమి గారు,రమాదేవి గారు,తులసి గారు,మమత గారు,వెంకటరెడ్డి గారు,సంతోష్ గారు,విష్ణుమూర్తి గారు,శ్రీనివాస్ గారు,వీరేశం గారు,శ్రీనివాస్ గారు,మారయ్య గారు,కిషన్ గారు,చక్రధర్ గారు పాల్గొన్నారు…
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments