ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అంకితభావంతో చేసిన సేవలే ప్రభుత్వంలోనూ ప్రజలలోను గుర్తింపు తెస్తాయని జిల్లా అటవీ శాఖ అధికారి డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్థానిక లక్ష్మీ గార్డెన్లో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ యాట శేఖర్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సమైక్యం పాల్గొని మాట్లాడారుసమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యాట శేఖర్ రెడ్డి అటవీ శాఖలో చిన్న ఉద్యోగంలో చేరి, కష్టపడి అంచలంచలుగా పదోన్నతులతో ఈ స్థాయికి వచ్చారన్నారు. ప్రభుత్వం నుండి చేసిన సేవలకు వృక్షమిత్ర అవార్డు పొందడం గర్వకారణమన్నారు.జిల్లాలో వివిధ ప్రాంతాలలో పనిచేసిన శేఖర్ రెడ్డి అక్కడి ప్రజల మెప్పు పొందారన్నారు. చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ఎలాంటి ఆరోపణలు లేకుండా పదవీ విరమణ చెందడం గొప్ప విషయం అన్నారు. అనంతరం శేఖర్ రెడ్డిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ ఎఫ్ సి ఐ మేనేజర్ లక్ష్మారెడ్డి. అటవీ శాఖ అధికారులు వెంకటేశ్వర్లు ప్రవీణ్, కుటుంబ సభ్యులు, శేఖర్ రెడ్డి సతీమణి, కుమారుడు, కోడలు సాయికుమార్ రెడ్డి రమ్య కూతురు అల్లుళ్ళు శ్వేత, విక్రం రెడ్డి, ప్రీతి,రంజిత్ రెడ్డి, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు,అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments