– బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నల్గొండలో కార్యక్రమం
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 196వ జయంతి కార్యక్రమాన్ని బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 196వ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సావిత్రిబాయి పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్త, విద్యావేత్త, కవయిత్రి అని, భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేసిన కీలక నాయకురాలిగా ఆమెను స్మరించుకుంటారని అన్నారు.

భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలిగా నిలిచిన సావిత్రిబాయి పూలే, కులం మరియు లింగం ఆధారంగా జరుగుతున్న వివక్ష, అన్యాయాలను నిర్మూలించేందుకు నిరంతరం కృషి చేశారని తెలిపారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె తన భర్త జ్యోతిబా ఫూలేతో కలిసి మహిళలు, నిమ్న కులాల విద్యాభివృద్ధికి విశేషంగా పనిచేశారని గుర్తు చేశారు.
కులవ్యవస్థ, సతీ సహగమనం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె, వితంతువుల పునర్వివాహాలకు మద్దతు ఇచ్చి సమాజ మార్పుకు బాటలు వేసిన మహనీయురాలని కొనియాడారు. సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ మార్పు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో
జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి అజయ్ కుమార్ యాదవ్,
టౌన్ ప్రెసిడెంట్ పుట్టా వెంకన్న గౌడ్,
కోఆర్డినేటర్ చెన్నూరు భరద్వాజ్,
వైస్ చైర్మన్ చిలక రాజు సతీష్,
విద్యార్థి జేఏసీ వైస్ చైర్మన్ కొంపల్లి రామన్న గౌడ్,
శ్రీనివాస్ యాదవ్, నరేష్ కుమార్, సౌజన్య, మమత, శృతి, పార్వతి, మహాలక్ష్మి, శిరీష, వెన్నెల, అనూష, పూజిత, త్రివేణి, లహరి, శోభ, అనిత తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments