e-paper
Thursday, January 29, 2026

కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడులు

రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ రమేష్ పట్టుబాటు

సంగారెడ్డి జిల్లా, తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధిలోని కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రమేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

2025 అక్టోబర్ 17న పీడీఎస్ బియ్యం తరలిస్తున్న ఒక లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు నుంచి తప్పిస్తామని చెప్పి, లారీ ఓనర్‌ను రూ.20 వేల లంచం ఇవ్వాలని కొల్లూరు ఎస్‌ఐ రమేష్ డిమాండ్ చేసినట్లు సమాచారం.

లంచం ఇవ్వడానికి నిరాకరించిన లారీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, ముందస్తు పథకం ప్రకారం పోలీసులు చర్యకు దిగారు.

పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్‌ఐ రమేష్‌ను ఏసీబీ అధికారులు నేరుగా పట్టుకున్నారు.

గమనార్హం ఏమిటంటే, ఎస్‌ఐ రమేష్ ఇప్పటికే బదిలీ లిస్ట్‌లో ఉన్న అధికారిగా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం, రమేష్‌కు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ ప్రారంభించారు.

ఈ కేసుకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!