నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా చంద్రశేఖర్ బడుగు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా, జగిని టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న శుక్రవారం మర్యాదపూర్వకంగా కలసి చేనేత శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జగిని వెంకన్న మాట్లాడుతూ, గత 69 సంవత్సరాలుగా వస్త్ర వ్యాపార రంగంలో కొనసాగుతూ ప్రజల విశేష మన్ననలు పొందుతున్న జగిని సంస్థ సేవలను కలెక్టర్కు వివరించారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న చలివేంద్రాలు, వివిధ ప్రజాసేవా కార్యక్రమాలు గురించి తెలియజేశారు.
అదేవిధంగా, జగిని దంత వైద్యశాల ద్వారా డాక్టర్ ఆదిత్య ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా అందిస్తున్న దంత వైద్య చికిత్సల సేవలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లా అభివృద్ధి, ప్రజాసేవల విషయంలో నూతన కలెక్టర్ సమర్థవంతంగా పనిచేయాలని జగిని వెంకన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments