– జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయిలో భాగస్వాములై జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ ఉద్యోగ సంఘాలు, రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా, మండల, గ్రామస్థాయిలో సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థంగా చేరేలా అమలు చేయాలని అధికారులను కోరారు.

పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడాలని, అప్పుడే జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, అదనపు రెవెన్యూ కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి వాణి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉపయోగపడేలా జిల్లా అధికారులు, సిబ్బంది, గజిటెడ్ అధికారులు, టీఎన్జీవో, రెవెన్యూ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు నోట్బుక్స్, పెన్నులు, దుప్పట్లు, పూల మొక్కలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేయగా, వివిధ ఉద్యోగ సంఘాల నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments