– డీఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్
ఉద్యోగులు విధి నిర్వహణలో ప్రజలకు చేసిన సేవలే పదవీ విరమణ అనంతరం వారికి శాశ్వత గుర్తింపునిస్తాయని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు.

బుధవారం స్థానిక టీఎన్జీవోస్ భవనంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
డాక్టర్ కేస రవి వైద్య ఆరోగ్యశాఖలో అంచలంచలుగా ఎదిగి డిప్యూటీ డీఎంహెచ్ఓ స్థాయికి చేరుకొని, ఎటువంటి ఆరోపణలు లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయమని డీఎంహెచ్ఓ పేర్కొన్నారు. గత 31 సంవత్సరాలుగా ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తూ, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి విశేష సేవలు అందించారని కొనియాడారు.
అలాంటి మంచి మనసున్న వైద్యుడు పదవీ విరమణ చేయడం బాధాకరమే అయినప్పటికీ, ప్రతి ఉద్యోగికి ఇది సహజ ప్రక్రియేనని అన్నారు. డాక్టర్ కేస రవి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కేస రవిని పూలమాలలు, సాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, డీసీహెచ్ఓ డాక్టర్ మాతృనాయక్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ గీతావాణి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments