e-paper
Friday, January 30, 2026

డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా సమావేశం

గెలిచిన యువ నాయకులకు సన్మానం

నల్గొండ, డిసెంబర్ 27, 2025:

భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎర్రయ్య స్మారక హాల్‌లో జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపొందిన డివైఎఫ్ఐ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కోట రమేష్ మాట్లాడుతూ, ధనబలానికి ఎదురొడ్డి ప్రజాబలంతో విజయం సాధించిన డివైఎఫ్ఐ యువ నాయకులను అభినందించారు. నిరంతరం యువజన, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలకు జవాబుదారితనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే యువకులను ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం. రవి నాయక్, జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, మాజీ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి పాల్గొన్నారు. అలాగే నాయకులు ఖమ్మంపాటి అంజి, అదిల్, బాలరాజు, తరుణ్, లింగస్వామి, శివ తదితరులు హాజరయ్యారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!