నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలివెల–కోతులారం ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య కుమారుడు చెరుకు శంకర్ ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
ప్రజాసేవ పట్ల నిబద్ధతతో, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలనే సంకల్పంతో చెరుకు శంకర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇన్ రామచంద్ర రావు చేతుల మీదుగా ఆయన అధికారికంగా పార్టీలోకి చేరారు.
ఈ కార్యక్రమం బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించబడింది.
ఈ చేరికతో మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మరింత బలపడనుందని, రానున్న రోజుల్లో ప్రజల సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలులో పార్టీ మరింత కట్టుదిట్టంగా పనిచేస్తుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments