నల్లగొండ, బుధవారం:
“బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు పోరాటం ఆగదు” అని బీసీ జేఏసీ చైర్మన్ చక్ర హరి రామరాజు స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 46 ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలు జరిగాయి.

నల్లగొండ పట్టణ కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే విగ్రహం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి చక్ర హరి రామరాజు నాయకత్వం వహించారు.
🔹 జీవో 46 బీసీలకు “గుదిబండ” లాంటిది – జేఏసీ నేత తీవ్ర వ్యాఖ్యలు
2019లో నల్లగొండ జిల్లాలో బీసీలకు 164 స్థానాలు ఉండగా, జీవో 46 ప్రకారం కేవలం 140 సీట్లు మాత్రమే కేటాయించబడినట్టు పేర్కొన్నారు. ఫలితంగా 24 స్థానాలు కోల్పోయామని, ఇది బీసీలకు “గొడ్డలిపెట్టి లాంటి నిర్ణయం” అని హరి రామరాజు విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే మార్పులు చేసి పాత సీట్ల కేటాయింపును కొనసాగించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు.

🔥 నిరసనలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో ప్రముఖులు:
కేశబోయిన శంకర్ ముదిరాజ్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కంది సూర్యనారాయణ,
చొల్లేటి రమేష్, సాయిబాబా, నల్ల మదు యాదవ్, గుంటోజు గోవర్ధన్, ఆదినారాయణ, బిక్షమయ్య నేత,
సర్వయ్య ముదిరాజ్, సింగారం మల్లయ్య ముదిరాజ్, దామోదర్, సుధాకర్, తరుణ్, శివ, అరవింద్,
ప్రవీణ్, విష్ణు, శివమణి, రవి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments