నల్గొండ, మంగళవారం:
మహిళలు ఆర్థిక స్వావలంబనం సాధించాలంటే క్రమశిక్షణతో పాటు ధైర్యం కూడా అవసరం అని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు.
🔹 26 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ₹26 కోట్లు 34 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను మహిళల పేరుపైనే అమలు చేస్తున్నందున, ప్రతి అంశం నేర్చుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా ఇటీవల జాతీయ స్థాయి అవార్డు పొందిందని, మహిళా సంఘాలు కూడా అటువంటి గుర్తింపుకోసం శ్రమించాలని చెప్పారు.
🔹 కొత్త అవకాశాలు – పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు
ప్రభుత్వం మహిళలకు పెట్రోల్ పంపులను అప్పగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నల్గొండ కేంద్రంలోని పెట్రోల్ పంపును డిసెంబరులో ప్రారంభించనున్నట్లు, అలాగే తిప్పర్తి మండలంలో మరో పెట్రోల్ పంపు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నల్గొండ, తిప్పర్తి మండలాల్లో రైస్ మిల్లులు నిర్వహణకు మహిళలకు శిక్షణ ఇచ్చి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
🔹 రెండు సంవత్సరాల్లో ₹66.78 కోట్ల రుణాలు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, పీడీలు 2023 డిసెంబర్ నుండి 2025 ఫిబ్రవరి వరకు
నల్గొండ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 32 మండలాల్లో ఉన్న 22,997 స్వయం సహాయక మహిళా సంఘాలకు
₹66 కోట్లు 78 లక్షల విలువైన వడ్డీ లేని రుణాలు అందించినట్లు తెలిపారు.
📍 కార్యక్రమంలో పాల్గొన్నవారు
డి.ఆర్.డి.ఓ శేఖర్ రెడ్డి మహిళా సమాఖ్య ప్రతినిధులు నల్గొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల మహిళా సమాఖ్య అధ్యక్షులు
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments