దేవరకొండ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎక్స్రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆంజనేయ వెటర్నరీ మెడికల్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా నిర్వహించబడింది. షాప్ యజమాని పచ్చిపాల శ్రీనివాస్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలునాయక్ గారు మాట్లాడుతూ—
గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్థక రంగం రైతుల జీవనోపాధికి కీలకమని, పశువుల ఆరోగ్య సంరక్షణలో వెటర్నరీ సేవలు మరియు మెడికల్ షాపులు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు. పశుపోషక కుటుంబాలకు శీఘ్రం గా, సమర్థవంతంగా ఔషధాలు, మార్గదర్శకత్వం అందించడంలో ఇలాంటి మెడికల్ షాపులు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. స్థానిక ప్రజలకు, రైతులకు మెరుగైన సేవలు అందించాలని, పశుసంపద అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని యాజమాన్యాన్ని సూచించారు.
తరువాత ప్రొప్రైటర్ పచ్చిపాల శ్రీనివాస్ యాదవ్ గారు ఎమ్మెల్యే బాలునాయక్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments