e-paper
Thursday, January 29, 2026

చదువే ధ్యేయంగాబాలికలు ధైర్యంగాముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. రోజుకు నిర్దిష్ట సమయం చదువుకు కేటాయించాలని,సోషల్ మీడియా మొబైల్ ఫోన్ ఇంస్టాగ్రామ్ ల వినియోగాన్ని పరిమితం చేయాలని, పుస్తక పఠనం ద్వారా నైపుణ్యాభివృద్ధి ఉన్నత లక్ష్యాలు నిర్ణయించి వాటిని సాధించే దిశగా ప్రతిరోజు కృషి చేయాలన్నారు. ఆడపిల్లలు మగ పిల్లల కంటే తక్కువ కాదని, భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు.

చదువుకుంటే డాక్టర్లు, కలెక్టర్లుగా, తయారు కావచ్చని, మనసులో ఏది బలంగా అనుకుంటే ఆ విధంగా తయారవ్వవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వై అశోక్ రెడ్డి,జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ,కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి. సి డబ్ల్యుసి చైర్మన్ చింత కృష్ణ ,చైల్డ్ వెల్ఫేర్ సంస్థ నాగ సేన రెడ్డి ,డి సి పి ఓ గణేష్,సరిత, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!