నల్లగొండ జిల్లా చర్లపల్లి గ్రామంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ధాన్యం తేమ శాతం, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం పరిమాణం, కొనుగోలు ప్రక్రియ వివరాలు తెలుసుకున్నారు.
తదనంతరం రైతులు, కేంద్ర నిర్వాహకులు, హమాలీలతో మంత్రి మాట్లాడారు.
మంత్రి మాట్లాడుతూ,
“తుఫాన్ ప్రభావం వల్ల కొంతకాలం కొనుగోళ్లు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం రోజుకు 10,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం,” అని తెలిపారు.
అలాగే ఆయన రైతులను ఉద్దేశించి,
“ప్రైవేట్ వ్యాపారులకు తొందరపడి ధాన్యం అమ్మకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి. అలా చేస్తే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా లభిస్తుంది,” అని సూచించారు.
ఇక చర్లపల్లి పరిసర ప్రాంతాల సాగు అభివృద్ధికి సంబంధించి మంత్రి తెలిపారు
“బ్రాహ్మణ వెల్లేముల కాలువల పనులు పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించాం. ఇందుకోసం ₹17 కోట్ల రూపాయలు భూసేకరణకు కేటాయించాం.”
అంతేకాక,
“రెండు సంవత్సరాల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి అయితే భూగర్భ జలాలు పెరగడంతో పాటు ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది,” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Related
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments