e-paper
Friday, January 30, 2026

నల్లగొండలో అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు, రైస్ మిల్లర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ,

“రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం సేకరణను వేగవంతం చేయాలి. రాత్రి పగలు లేకుండా అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలి,” అని సూచించారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించాలని, అలాగే తేమ, తరుగు, తాలు పేర్లతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని మంత్రి హెచ్చరించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

పత్తి కొనుగోలు నిబంధనల సడలింపుపై కేంద్రానికి నివేదిక పంపినట్టు మంత్రి తెలిపారు.

అలాగే బాయిల్డ్ రైస్ కోటా, బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి, ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపనున్నట్టు చెప్పారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!