e-paper
Thursday, January 29, 2026

బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలి: బీసీ జేఏసీ

బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు.

నగరంలోని టీఎన్జీవో భవన్లో జరిగిన కుల సంఘాల సమావేశంలో 40 కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునాస ప్రసన్నకుమార్‌ను జిల్లా జేఏసీ చైర్మన్‌గా ఆమోదించి సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ మాట్లాడుతూ:

రేపటి నుండి జిల్లావ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ ఈ విషయంలో మౌనం వీడాలని కోరారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి బీసీ రిజర్వేషన్ల విషయం ప్రధానితో మాట్లాడాలని కోరారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధాని నివాసం ముందు ధర్నా నిర్వహించాలన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో విభిన్న కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!