ePaper
Sunday, September 6, 2026

మత్స్యకారుల సహకార సంఘానికి కొత్త పాలకవర్గం ఎన్నిక

చీకటి వెలుగు నల్లగొండ,

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం ముస్సి గ్రామంలోని మత్స్యకారుల మార్కెటింగ్ సహకార సంఘం లిమిటెడ్ పాలకవర్గ ఎన్నికలను తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964లోని సెక్షన్ 31-బి, తెలంగాణ సహకార సంఘాల నియమాలు–1964లోని నియమం 22 ప్రకారం నిర్వహించినట్లు అదనపు రిజిస్ట్రార్, రాష్ట్ర సహకార ఎన్నికల ప్రాధికార సంస్థ ధృవీకరించింది. పోటీ ఎన్నికలు జూన్ 25, 2026న రహస్య బ్యాలెట్ విధానంలో, అనంతరం పదవుల ఎన్నిక జూలై 20, 2026న నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అలువాల వెంకటస్వామి అధ్యక్షుడిగా, భూపతి జనకిరాములు ఉపాధ్యక్షుడిగా, అంజమ్మ అంబటి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అలాగే అంజయ్య పెరెల్లి, గోదాడాటి చంద్రమ్మ, సాదుల నర్సయ్య, భూపతి శ్రీనివాస్, అల్లి రామ్ మోహన రాజు, భాతిని సైదులు, గోదాడాటి రవి, వెలుగు సైదులు, ఎదుల సురేష్, మాడ లక్ష్మీనారాయణ పాలకవర్గ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నూతన పాలకవర్గం పదవీకాలం 2026 జూన్ 25 నుంచి ప్రారంభమై 2031 జూన్ 24తో ముగియనున్నట్లు ఎన్నికల ధృవీకరణ పత్రంలో పేర్కొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!