‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో జరుగుతున్న జనగణన (Census) కార్యక్రమంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ జనగణన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమమని ఆయన తెలిపారు.
ఈసారి జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి మొబైల్ యాప్ ద్వారా వివరాలను నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విధానం వల్ల ప్రక్రియ మరింత వేగవంతం, పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
దేశ అభివృద్ధి ప్రణాళికలకు ఈ డేటా కీలకమని, ప్రజలు సహకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments