అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల దర్యాప్తులో నిందితులు ఆలయ బాత్రూమ్లో నగదును తాత్కాలికంగా దాచి, అనుమానం రాకుండా చిన్నచిన్న మొత్తాలుగా బయటకు తరలించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అలాగే సీసీటీవీ కెమెరాల బ్లైండ్స్పాట్లను ఉపయోగించి ఈ చర్యలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు, నగదు ప్రవాహం, ఆస్తుల కొనుగోళ్లు, మరికొందరి ప్రమేయంపై కూడా లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో ఇప్పటివరకు గణనీయమైన నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments