వందే భారత్ ట్రైన్లో ప్రయాణికులకు అందించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై సంబంధిత సంస్థపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి సంస్థ అముల్ స్పందించింది. తమ ఉత్పత్తిలో ఎలాంటి లోపం లేదని, తయారీ సమయంలో అన్ని నాణ్యత ప్రమాణాలను పాటించామని పేర్కొంది.
ఈ సమస్య సరఫరా లేదా నిల్వ ప్రక్రియలో జరిగిన తప్పిదం కావచ్చని అముల్ వివరణ ఇచ్చింది.
ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments