హైదరాబాద్ | ప్రమాద వార్తలు:
హైదరాబాద్ నగరంలో మరో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. బేగంపేట ఫ్లైఓవర్పై మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన కారు డివైడర్ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీకొనడంతో పల్టీలు కొడుతూ ఫ్లైఓవర్పైనే బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన కారును తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments