*వేములవాడ:*
వేములవాడ అర్బన్ మండలం శభాష్ పల్లి గ్రామ సర్పంచ్గా ఎటి యాదవ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.
గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తానని ఎటి యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. శభాష్ పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు మరియు ప్రజలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments