గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హాఫీస్ ఖాన్.
జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయాన్ని అన్ని హo
గులతో పాఠకులకు సౌకర్యంగా ఉండే విధంగా అభివృద్ధి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హాఫీస్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఆయన 58వ గ్రంథాలయ వారోత్సవాలను మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి సహకారంతో ప్రదీప్ రెడ్డి ఫౌండేషన్
ఆధ్వర్యంలో నూతన భవనం నిర్మించారని తెలిపారు. అలాగే నిరుద్యోగులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల లోకి వెళ్లి డబ్బులు సెంటర్లఅనవసరంగా ఖర్చు పెట్టకుండా జిల్లా గ్రంధాలయంలో చదువుకోవచ్చు అన్నారు. వివిధ గ్రూప్ కాంపిటీషన్లకు ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన పుస్తకాలు లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. అలాగే వివిధ గ్రామాల నుండి దూర ప్రాంతాల నుండి వచ్చిన నిరుద్యోగులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పించామని, ఉదయం ఏడు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గ్రంధాలయంలో చదువుకోవచ్చు అన్నారు.ఈ గ్రంథాలయంలో చదువుకొని అనేకమంది ఉద్యోగాలు సాధించారన్నారు. గ్రంధాలయ వారోత్సవాలలో వారం రోజులపాటు ఈనెల 14 నుండి 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనట్టు తెలిపారు. వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జూపూడి రమేష్.కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి.మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాధ వినోద్ రెడ్డి. మాజీ జడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య. మాజీ కౌన్సిలర్లు బషీరుద్దీన్, సమద్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి,అల్లి సుభాష్, చల్లేటి ప్రభాకర్, గ్రంథ పాలకుడు నాగిరెడ్డి, గ్రంధాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments