నల్లగొండ పట్టణంలోని బి.సి–డి హాస్టల్ (గాయత్రినగర్) సమీపంలో, రైల్వే అండర్పాస్ దగ్గర నుంచి పద్మనగర్ వైపు వెళ్లే రహదారి పూర్తిగా బ్లాక్ అయ్యింది.
రైల్వే అధికారులు అండర్పాస్లోని నీటిని ఒక బావిలోకి పంపుతున్నారని, ఆ బావిలోని నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపడం వలన ఆ నీరు హాస్టల్ పరిసర ప్రాంతం మొత్తం నిండిపోయిందని స్థానికులు తెలిపారు.

దీని ఫలితంగా దోమల పెరుగుదల, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బి.సి–డి హాస్టల్లో సుమారు 200 మంది విద్యార్థులు ఉంటున్నారు. అదేవిధంగా గాయత్రినగర్ కాలనీలో 50 ఇళ్లలో నివసించే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

“రోడ్డు పూర్తిగా బ్లాక్ అయిపోయింది. మేము రైల్వే అధికారులను పలుమార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు,”
అని బాధితులు తెలిపారు.

ఇట్లు : చీకటి వెలుగు న్యూస్, నల్లగొండ
స్థానం : బి.సి–డి హాస్టల్, గాయత్రినగర్, నల్లగొండ
బి. చంద్రశేఖర్
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments