e-paper
Thursday, January 29, 2026

యూనివర్సిటీ సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కు వినతిపత్రం అందజేత

నల్గొండ:

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నల్గొండలోని రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గారికి యూనివర్సిటీ సమస్యలపై మరియు అభివృద్ధి కార్యక్రమాలపై వినతిపత్రం అందజేయడం జరిగింది.

విద్యార్థుల ప్రధాన అభ్యర్థనలు

సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలి: ఫీజుల భారం విద్యార్థులపై పడుతున్నందున, కోర్సులను రెగ్యులర్ చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని సూచించారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం: లా, ఫార్మసీ, బిఈడి, ఎంఈడి, జర్నలిజం వంటి కొత్త కోర్సులు యూనివర్సిటీలో ప్రారంభించాలని అభ్యర్థించారు. స్కై వాక్ ఏర్పాటు: నేషనల్ హైవే సమీపంలో వేలాది విద్యార్థులు యూనివర్సిటీకి రాకపోకలు జరుపుతున్న సమయంలో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని, స్కై వాక్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్లేస్‌మెంట్ అవకాశాలు: యూనివర్సిటీకి మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకురావడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తు కోసం అవకాశాలను విస్తరించాలని సూచన.

మంత్రిగారి స్పందన

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్, కార్యదర్శి మోహన్, కో-కన్వీనర్ మౌనేష్, ఉపాధ్యక్షులు విజయ్, సూర్య, విద్యార్థి నాయకులు సంపత్, నరసింహ, సుధీర్, సతీష్, అజయ్, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!