తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 INTUC ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రమశక్తి అవార్డు గ్రహీత, కంపెనీ అధ్యక్షులు ఎం. సురేష్ కుమార్ హాజరై జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు ఏకతాటిపై నిలబడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ సంస్థలో శ్రమదోపిడికి గురవుతున్న ఆర్టిజన్లు, పీస్ రేట్ కార్మికులకు న్యాయం జరిగే వరకు యూనియన్ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమిరెడ్డి, కార్యదర్శి పాండు మరియు ఇతర నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments