ePaper
Sunday, September 6, 2026

అయోధ్య హుండీల్లో రూ.10, రూ.20 నోట్లే ఎక్కువ..

అయోధ్య శ్రీరామ మందిర హుండీల లెక్కింపులో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హుండీల్లో అత్యధికంగా రూ.10, రూ.20 నోట్లే ఉన్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు తమ స్థోమతకు తగ్గట్టుగా చిన్న మొత్తాల్లోనూ భక్తిశ్రద్ధలతో విరాళాలు సమర్పిస్తున్నారని ట్రస్ట్ పేర్కొంది. పెద్ద మొత్తాల విరాళాల కంటే చిన్న నోట్ల సంఖ్యే అధికంగా ఉండటం భక్తుల విశ్వాసానికి నిదర్శనమని అధికారులు తెలిపారు.

హుండీల్లో వచ్చిన నగదును భద్రతా ప్రమాణాల మధ్య లెక్కించి, ఆలయ అభివృద్ధి, నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం వినియోగిస్తున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!