ట్రస్మా ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ స్థానిక చర్లపల్లి లోని విపస్య హైస్కూల్ గ్రౌండ్ లో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నేడు నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ గారు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్, కో-కన్వీనర్ ముక్కామల రామ్మోహన్ గార్లు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు మాట్లాడుతూ, ఇలాంటి క్రీడా కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని, విద్యార్థుల మానసిక ఉల్లాసం పెరుగుతుందని తెలిపారు. ఆటల వల్ల చదువులో ఏకాగ్రత పెరిగి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.
అనంతరం కన్వీనర్ రవికుమార్ గారు మాట్లాడుతూ, పాఠశాలల మధ్య ఐక్యతను పెంపొందించడం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడం, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ప్రైవేటు పాఠశాలలు ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నాయని తెలిపారు. ట్రస్మా పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నిర్వాహకులు ఎన్. రమేష్ రెడ్డి, అలుగుబెల్లి శ్యాంసుందర్ రెడ్డి, ఫయాజ్, యాదయ్య, చర్లపల్లి గణేష్, నాగేందర్, జానయ్య, మనోజ్, కళ్యాణ్, బిజు జోసెఫ్, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments