హైదరాబాద్:
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చెయిన్ స్నాచింగ్ ఘటనలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (IPS) ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రత్యేకంగా మహిళలు రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దయచేసి పబ్లిక్ ప్రదేశాల్లో బంగారు ఆభరణాలను ప్రదర్శిస్తూ తిరగకూడదని, అవసరం లేకుండా విలువైన నగలు ధరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
చైన్ స్నాచింగ్ లేదా అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బాధితులు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, ఇలాంటి ఘటనల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు కాల్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలను కోరారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments