ePaper
Friday, April 10, 2026

ఏసీబీ ట్రాప్‌లో ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది.

పదవీ విరమణ పొందబోతున్న ఓ ఉపాధ్యాయుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఇంచార్జ్ ఎంఈఓ రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ చంద్రమౌళి ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.

ఈ ట్రాప్ ఆపరేషన్‌ను నిర్వహించిన ఏసీబీ అధికారులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఈ ఘటనతో విద్యాశాఖలో అవినీతి మరోసారి బయటపడగా, అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!