281 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
గుర్రంపోడు మండలం: గుర్రంపోడు మండలంలోని కొప్పోలు గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మారపాక శంకర 281 ఓట్ల భారీ ఆధిక్యంతో సర్పంచ్గా ఘన విజయం సాధించారు. ఈ ఫలితంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
ఫలితాలు వెలువడిన అనంతరం నూతన సర్పంచ్ మారపాక శంకర మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ సీటు కేటాయించి పూర్తి మద్దతు అందించిన కాటేపల్లి రాధాకృష్ణ పంతులు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన పంతులు రాధాకృష్ణ గారికి, విజయంలో తోడుగా ఉన్న గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన కొప్పోలు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
స్థానికులు, నాయకులు ఆయన నాయకత్వంలో కొప్పోలు గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments