Monday, October 27, 2025

నవంబర్ 15లోపు 65 లక్షల మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ – మంత్రి తుమ్మల ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ చీరలు’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. చెనేత మరియు జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది మహిళలకు నవంబర్ 15 లోపు చీరలు పంపిణీ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మంత్రి మాట్లాడుతూ –

“ఈ సారి పంపిణీ జరగబోయే ఇందిరమ్మ చీరల కోసం మొత్తం 4.34 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా, ఇప్పటివరకు 3.65 కోట్ల మీటర్లు ఉత్పత్తి పూర్తయింది,” అన్నారు.

ఇప్పటివరకు 33.35 లక్షల చీరలు జిల్లా గోదాములకు చేరాయి.

మిగతా చీరల తయారీ మరియు ప్యాకేజింగ్‌ దశలు కూడా వేగంగా సాగుతున్నాయి.

ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,900 మంది చెనేత కార్మికులకు ఉపాధి లభించింది. వారు 6 నుండి 8 నెలలపాటు పని చేసి నెలకు రూ. 18,000 – 22,000 మధ్య ఆదాయం పొందగలుగుతున్నారు.

మంత్రి తెలిపారు ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చేనేత రంగానికి ఊతం లభిస్తుందని అన్నారు.

1

Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!