e-paper
Monday, October 27, 2025
spot_imgspot_imgspot_img

మునుగోడులో లిక్కర్ షాప్‌లకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కొత్త షరతులు

మునుగోడు:

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్థానిక లిక్కర్ షాప్‌లకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులు కోరిన నేపథ్యంలో, ఎక్సైజ్ సూపరిండెంట్‌కు నియోజకవర్గ నాయకుల వినతిపత్రం అందజేశారు.

ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెప్పిన విధంగా, మునుగోడు నియోజకవర్గంలో మద్యానికి బానిసలై, కుటుంబం పట్టించుకోక అనారోగ్య కారణాలతో అర్ధాంతరంగా మరణించే పరిస్థితులు చోటు చేసుకోవడం, అనేక కుటుంబాలు కష్టంలో పడిన నేపధ్యంలో, గత రెండు సంవత్సరాలుగా బెల్ట్ షాప్‌లను నిషేధించడం, సిండికేట్లను నిరోధించడం, సమయపాలన పాటించడం వంటి చర్యలను అమలు చేస్తున్నారు.

ఇక కొత్తగా వైన్స్ షాప్‌లకు దరఖాస్తు చేసుకునే వ్యాపారులు నిబంధనలు కచ్చితంగా పాటించాలన్న హెచ్చరిక ఇచ్చారు. షాప్‌లను స్వేచ్ఛగా నిర్వహించడం కుదరదని ముందే స్పష్టం చేశారు.

రాజన్న రూల్స్ – ప్రధాన నిబంధనలు

వైన్స్ షాప్‌లు ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మాలి మండలానికి చెందిన స్థానికులు మాత్రమే టెండర్లు వేయాలి; ఇతర మండలానికి చెందిన వారు అనర్హులు వైన్స్ షాప్‌లు ఊరి బయట మాత్రమే ఏర్పాటు చేయాలి షాప్‌కు అనుబంధంగా సిట్టింగ్ పర్మిట్ రూమ్ ఉండకూడదు ముఖ్యంగా బెల్ట్ షాప్‌లకు మద్యం అమ్మకాలు కరువు లాటరీ ద్వారా వైన్స్ షాప్ పొందిన ఓనర్స్ సిండికేట్ కాకూడదు

వినతిపత్రం అందజేసిన నాయకులు

మునుగోడు నియోజకవర్గ మాజీ జెడ్పిటిసి నారాబోయిన రవి ఆధ్వర్యంలో, మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాలకు చెందిన నాయకులు:

పల్లె వెంకన్న, కత్తి రవీందర్ రెడ్డి, పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, జూనియర్ రఘుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి, ధోటి వెంకటేష్ యాదవ్, చంద్రశేఖర్ గౌడ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!