నల్గొండ:

జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పంట కొనుగోలు ఆలస్యం, కనీస మద్దతు ధర లోపం, నష్టపోయిన పంటలకు నష్టపరిహారం, ఎరువు-విత్తనాల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
ధరణి అనంతరం, జిల్లా కలెక్టరుకు మెమోరాండం సమర్పించి, రైతుల సమస్యలపై అత్యవసర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను కోరారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి పాల్గొని రైతుల తరఫున తమ సంఘీభావం ప్రకటించారు. స్పందన రాకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కన్మత రెడ్డి అశోక్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి, బీజేపీ కిసాన్ మోర్చా గుండా నవీన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, కిసాన్ మోర్చా ఓం ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు, కిసాన్ మోర్చా పక్కిర్ మోహన్ రెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాదూరి వెంకట్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు, కిసాన్ మోర్చా పిండి పాపిరెడ్డి, రైతు నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రైతు నాయకుడు పోలోజు బిక్షమాచారి, నల్లగొండ అసెంబ్లీ కన్వీనర్, కిసాన్ మోర్చా భోగరి అనిల్ కుమార్, నల్లగొండ మండల బీజేపీ అధ్యక్షుడు ఏమిరెడ్డి శ్రీనివాస రెడ్డి, బీజేపీ జిల్లా నాయకుడు ఏమిరెడ్డి బిక్షం రెడ్డి, జిల్ల స్థాయి నాయకుడు బీపంగి జగ్జీవన్, బీజేపీ నాయకుడు
నాయకులు రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments