నిన్న జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన దాడిని ఖండిస్తూ, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారు ఈరోజు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను సందర్శించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి, ప్రజల నుండి వివరాలు తెలుసుకుని, డంపింగ్ యార్డ్పై వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకుంటామని MP తెలిపారు.

రంగుల శంకర్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తరువాత, దాడికి గురైన రంగుల శంకర్ ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించిన ఈటల రాజేందర్ గారు, ఆనంద్ గౌడ్ గారు మరియు రాష్ట్ర, జిల్లా బీజేపీ నాయకులు ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
శ్రీ గంధమల్ల ఆనంద్ గౌడ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శ్రీ పట్లొళ్ల విక్రం రెడ్డి, మేడ్చల్ జిల్లా మాజీ అధ్యక్షుడు & కామారెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి ఓబీసీ జిల్లా అధ్యక్షులు మహేందర్ యాదవ్ మరియు రాష్ట్ర, జిల్లా నాయకులు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments