e-paper
Thursday, January 29, 2026

కేంద్ర హెచ్చరికలపై X యాక్షన్.. వేలాది పోస్టులు డిలీట్

న్యూఢిల్లీ:

కేంద్ర ప్రభుత్వ నోటీసులకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (మాజీ ట్విటర్) స్పందించింది. ప్రభుత్వ సూచనల మేరకు 3,500 అసభ్యకర పోస్టులను తొలగించడంతో పాటు 600 ఖాతాలను డిలీట్ చేసినట్లు X సంస్థ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అసభ్యకరమైన, ద్వేషపూరితమైన కంటెంట్ పెరుగుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో చట్టానికి విరుద్ధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు X చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

సోషల్ మీడియా వేదికలపై నియంత్రణ అవసరమని, ముఖ్యంగా ప్రజా శాంతి, మహిళల భద్రత, చిన్నారుల రక్షణ దృష్ట్యా ఇలాంటి చర్యలు తప్పనిసరిగా మారాయని కేంద్ర వర్గాలు పేర్కొంటున్నాయి. భవిష్యత్తులోనూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!