నల్గొండ మండలం మెల్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన పవన్ రెడ్డి అమెరికాలో శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సమాచారం. బీటెక్ పూర్తి చేసిన పవన్ రెడ్డి ఉన్నత విద్య (ఎంఎస్) కోసం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీకి హాజరైన అనంతరం అతడు అకస్మాత్తుగా మృతి చెందాడు.
పవన్ రెడ్డికి ఇటీవలే ఉద్యోగం కూడా లభించినట్లు కుటుంబ సభ్యులు చెబుతుండగా, ఈలోపే ఈ విషాద ఘటన జరగడంతో వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments