e-paper
Thursday, January 29, 2026

లడ్డూ ‘కల్తీ’ వెనుక భారీ కుట్ర! – YV సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్‌తో TTD నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్!

కీలక పరిణామం: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సిట్ దర్యాప్తులో భారీ కుట్ర కోణం బయటపడింది.

• నిందితుడు: టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి పీఏగా పనిచేసిన కడూరు చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేసి 24వ నిందితుడిగా చేర్చారు.

• కుట్ర వివరాలు (రిమాండ్ రిపోర్టు ప్రకారం):

• 2022లో అప్పన్న, అప్పటి టీటీడీ కొనుగోళ్ల విభాగం జీఎంను సంప్రదించారు.

• నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యానికి ఫోన్ చేసి, ప్రతి కిలో నెయ్యిపై రూ. 25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

• డెయిరీ యాజమాన్యం కమీషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ సంస్థపై అనర్హత వేటు వేయడానికి అప్పన్న కుట్ర పన్నారు.

• అజ్ఞాత వ్యక్తులతో పిటిషన్లు వేయించి, భోలేబాబా డెయిరీని తనిఖీ చేయాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.

• ఫలితంగా, భోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరణ నిలిచిపోయింది. వారి స్థానంలో వచ్చిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అనే సంస్థ, కిలోకు రూ. 138 ఎక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుంది.

• ముడుపులు: ఈ మొత్తం వ్యవహారంలో చిన్న అప్పన్నకు దాదాపు రూ. 50 లక్షల వరకు ముడుపులు అందినట్లు అప్పన్న బ్యాంకు లావాదేవీల ద్వారా సిట్ గుర్తించింది.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!