దావోస్ | అంతర్జాతీయ వార్తలు:
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum – Davos)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీని తనకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేర్కొన్న ట్రంప్, భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయనే నమ్మకం వ్యక్తం చేశారు.
భారత్–అమెరికా మధ్య ట్రేడ్ అగ్రిమెంట్పై నేరుగా ప్రశ్నించగా, రెండు దేశాల మధ్య మంచి ఒప్పందం కుదరబోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. భారత్తో వాణిజ్య ఒప్పందంపై సానుకూల చర్చలు కొనసాగుతున్నాయని, సమీప భవిష్యత్తులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు.
ట్రంప్ వ్యాఖ్యలు గ్లోబల్ మార్కెట్లతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర మరింత పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments