నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల వేధింపులతో ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మరణించిన తరువాత తన ముగ్గురు కూతుళ్లను పోషించడానికి రోడ్డు పక్కన బండిపై పూలు, పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆమె తెలిపింది.
హైదరాబాద్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని ప్లాట్ఫారంపై గత 15 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తోందని పేర్కొంది. అయితే మంగళవారం ట్రాఫిక్ పోలీసులు వచ్చి బండిని ఇక్కడి నుండి తొలగించాలని, బలవంతంగా పూలు పండ్లు చిందరవందర చేశారని ఆమె ఆరోపించింది.
నల్లగొండ పట్టణంలో అనేక మంది చిరు వ్యాపారులు ప్లాట్ఫారమ్లపై వ్యాపారం చేస్తుండగా, తన బండినే తీసేయమని ఒత్తిడి చేయడం అన్యాయమని ఆమె పేర్కొంది.
తన పిల్లలను బతికించుకోవడానికి చేసే చిన్న వ్యాపారాన్ని అడ్డుకోవడం తప్పని, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments