నల్లగొండ మెడికల్ కాలేజీలో జరిగిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మాట్లాడుతూ, ర్యాగింగ్ ఒక నేరం అని స్పష్టం చేశారు.
సీనియర్లు, జూనియర్లు అనే తేడాలు మానుకొని సోదరభావంతో ఉండాలని విద్యార్థులను పిలుపునిచ్చారు.
యస్పీ తెలిపారు:
ర్యాగింగ్ చేస్తే 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష కేసు నమోదైతే విద్యార్థి భవిష్యత్తు నష్టపోతుంది ర్యాగింగ్ అనేది శారీరక, మానసికంగా వేధించడం, భయపెట్టడం, అవమానించడం వంటి అన్ని చర్యలు దీనిలోకి వస్తాయి
విద్యార్థులు మెడికల్ సీటు పొందడానికి ఎంత కష్టం చేశారో గుర్తుంచుకొని, క్షణిక సరదా కోసం జీవితాన్ని పాడుచేసుకోకూడదని హెచ్చరించారు.
ర్యాగింగ్ ఘటనలు జరిగితే వెంటనే:
డయల్ 100 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి, వన్టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments